AP EAMCET 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 17 వరకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) AP EAMCET 2026 కోసం రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించింది. ఏపీ ఎంసెట్ (EAMCET) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇప్పుడు మార్చి 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ పొడిగింపు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు cets.apsche.ap.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తు ఫారమ్లో సవరణలు చేసుకునేందుకు ఇప్పుడు ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 6, 2026 వరకు చేసుకోవచ్చు. దీని తర్వాత, పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 28, 2026 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు గతంలో షెడ్యూల్ చేసినట్లే ఉంటాయి. ఇంజనీరింగ్ (బిటెక్) 2026 మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించబడతాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు 2026 మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. పరీక్షల తర్వాత కీ పేపర్స్ మే 23, 2026న విడుదల చేస్తారు. ఫలితాలు 1 జూన్ 2026న ప్రకటించే అవకాశం ఉంది.