ఇరాన్ యుద్ధం.. భారత్ జోక్యం చేసుకుంటే పరిస్థితులు సద్దుమణుగుతాయి: ఫిన్లాండ్ అధ్యక్షుడు
అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.
అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. భారతదేశంలో తన అధికారిక పర్యటన (మార్చి 4 నుంచి 7) ముగించుకుని తిరిగి వెళ్లిన అలెగ్జాండర్ స్టబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో 18 రోజుల సంఘర్షణ ప్రపంచ విపత్తుగా మారకుండా నిరోధించడం కోసం భారత్ తన ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు (Finland President India role).
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి మధ్యవర్తిత్వం చేయడంలో భారతదేశం సహాయపడగలదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు. 'మనందరికీ కాల్పుల విరమణ అవసరం. భారత్ నిజంగా ఇందులో జోక్యం చేసుకోగలదా అని నేను ఆలోచిస్తున్నాను. పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం మనం చూశాం' అని స్టబ్ అన్నారు. భారత్కు అటు అమెరికా, ఇజ్రాయెల్తోనూ, మరోవైపు ఇరాన్తోనూ స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఇరు పక్షాలు న్యూఢిల్లీ పట్ల నమ్మకంగా ఉంటాయని అన్నారు (India mediation Iran US).
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి మధ్యవర్తిత్వం చేయడంలో భారతదేశం సహాయపడగలదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు. 'మనందరికీ కాల్పుల విరమణ అవసరం. భారత్ నిజంగా ఇందులో జోక్యం చేసుకోగలదా అని నేను ఆలోచిస్తున్నాను. పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం మనం చూశాం' అని స్టబ్ అన్నారు. భారత్కు అటు అమెరికా, ఇజ్రాయెల్తోనూ, మరోవైపు ఇరాన్తోనూ స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఇరు పక్షాలు న్యూఢిల్లీ పట్ల నమ్మకంగా ఉంటాయని అన్నారు (India mediation Iran US).