IPL 2026: ఆర్సీబీ, ఆర్ఆర్ అమ్మకం.. ఐపీఎల్లోని 10 జట్ల ఓనర్లు వీళ్లే!
IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెట్ లీగ్ లో ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ లీగ్ లో ఆడే ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన యజమాన్య నిర్మాణం ఉంటుంది. ఈ ఐపీఎల్ లోని 10 జట్ల వెనుక భారీ వ్యాపార సామ్రాజ్యాధినేతలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. తాజాగా ఈ మెగా క్యాచ్ రిష్ లీగ్ లో భారీ క్రేజ్ సంపాదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమ్ముడుపోయాయి.
కాగా ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్స్టోన్ సంస్థలు దక్కించుకోగా.. రూ.15, 280 కోట్లకు రాజస్థాన్ జట్టుని ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియం చేజిక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ అమ్మకాలతో ఐపీఎల్ లోని 10 జట్ల ఓనర్స్ ఎవరని క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్ల వెనుక ఉన్న యజమానులు చూస్తే.. కార్పొరేట్ ప్రపంచం, సినీ రంగం, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కలిసి ఈ లీగ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లినట్లుగా క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ బలమైన యాజమాన్యాల వల్లే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు అత్యంత ధనిక వంతమైన లీగ్ గా గుర్తింపు పొందింది.