సోనియా గాంధీకి అస్వస్థత: ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక.. పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మంగళవారం(2026 మార్చ్ 24) రోజు రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని.. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
అయితే గతంలో సోనియా గాంధీ శ్వాసకోశ సమస్యలతో ఇదే ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని విపరీతమైన చలి, పెరిగిన కాలుష్యం (Pollution) వల్ల ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని డాక్టర్లు వెల్లడించారు.
అయితే వయసు రీత్యా, శ్వాస ఇబ్బందుల వల్ల ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని, ముందుజాగ్రత్తగా ఆమెను అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం ఆమెకు యాంటీబయాటిక్స్, ఇతర అవసరమైన మందులు అందిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గం తెలిపింది.