దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినే : కేంద్ర మంత్రి బండి సంజయ్
రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారని.. దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు వెనుక అసలు కుట్ర ఇదేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జమిలి ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుందనే భయం రేవంత్కు పట్టుకుందన్నారు. రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదు కాబట్టే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినేనన్నారు. మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ తప్పు చేశాయన్నారు.