షాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులపై నిషేధం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీతారాంపురం ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్ల వినియోగంపై ప్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి నిషేధాజ్ఞలు జారీ చేశారు. గురువారం వీటిని ఎవరూ వినియోగించవద్దని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు, డ్రోన్ ఆపరేటర్లు ఈ నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.