Kangana Ranaut: సారా కూడా సనాతనే.. నిజం చెప్పడానికి భయమెందుకు? - కంగనా సంచలన కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీఖాన్ కు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) షాక్ ఇచ్చింది. ఇకపై హిందూవేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూక కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన ధర్మంపై విశ్వాసం ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పిస్తే ఆలయ సముదాయాల్లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ ఎంపీ కంగానా రనౌత్ చేసిన వ్యాఖ్యలలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఏడాది నుంచి 47 దేవాలయాల్లోకి హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే, సారా అలీ ఖాన్ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సారా గతంలో అనేకసార్లు ఈ ఆలయాలను సందర్శించినప్పటికీ, ఇకపై ఆమె అక్కడ పూజలు చేయాలంటే నేను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను, నాకు హిందుత్వపై విశ్వాసం ఉంది అని లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫార్మాట్ను కూడా కమిటీ రూపొందించింది.
ఈ విషయంలో సారాకు మద్దతు ఇస్తూనే నిజాయితీగా ఉండాలని ఎంపీ కంగనా రనౌత్ సూచించారు. "ఇక్కడ ఉన్నవారంతా సనాతనులే. ఆమె (సారా) కూడా సనాతనే. అలాంటప్పుడు నిజాన్ని అఫిడవిట్ రూపంలో రాయడానికి భయం ఎందుకు?" అని కంగనా ప్రశ్నించారు. నిజం చెప్పడంలో ఎటువంటి సంకోచం ఉండకూడదని ఆమె నొక్కి చెప్పారు.