చేవేళ్లలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
చేవెళ్ల, మార్చి 20: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో కూడిన ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు ఏం జరుగుతుందో అని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గట్టిగా శబ్ధం వినిపించిందని, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.
చేవెళ్ల, మార్చి 20: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్ధంతో కూడిన ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు ఏం జరుగుతుందో అని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గట్టిగా శబ్ధం వినిపించిందని, కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.
భూ ప్రకంపనల ధాటికి ఇంట్లో వస్తువులు కదలడం, పాత్రలు శబ్ధం చేయడంతో ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.