మొదలుకాని ‘పత్తిపాక రిజర్వాయర్’ పనులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిధిలో పత్తిపాక రిజర్వాయర్నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి రెండేళ్లయినా ఇంకా పనులు మొదలుకాలేదు. రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం రిజర్వ్లో పెట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్నిర్మాణం కోసం డీపీఆర్రెడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీడబ్ల్యూసీకి అనుగుణంగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశిస్తూ గతేడాది ఫండ్స్ కూడా కేటాయించారు. కానీ ఇప్పటివరకు డీపీఆర్ కూడా రెడీ పూర్తికాలేదు.
గత సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ కింద ఉన్న ఆయకట్టు భూములకు నీరందించాలనే ఆలోచనతో రిజర్వాయర్నిర్మాణం చేయాలనుకుంది. దానికోసం ధర్మారం మండలం పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించాలని గత సర్కార్ ప్లాన్ చేసింది. దానికోసం ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో కట్టాలనే దానిపై కచ్చితమైన నిర్ణయానికి రాలేదు.
దీంతో పత్తిపాక నిర్మాణం మూలనపడిపోయింది. కాంగ్రెస్పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా సర్కార్ ఏర్పాటైన వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పత్తిపాకపై క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో జిల్లా మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి డీపీఆర్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.