వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. నిప్పులు చెరిగిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన సంజీవని ప్రజా వేదిక సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అకృత్యాలను వివరిస్తున్నానంటూ... ఇదే గొడ్డలి పార్టీ నైజం అంటూ విమర్శలు చేశారు. 11 విషయాలు చెపుతానంటూ.. మీది గొడ్డలి పార్టీ అని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదని.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అన్నారు. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.