Select Location
All Locations
State
Region
City / District
సింగరేణిని దోచుకున్నది బీఆరెస్సే...కేటీఆర్, హరీశ్ రావు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

సింగరేణిని దోచుకున్నది బీఆరెస్సే...కేటీఆర్, హరీశ్ రావు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: పదేండ్లపాటు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, దోపిడీకి గురిచేసిందిబ బీఆర్ఎస్​ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్​కమిటీ చైర్మన్​ఎంఎస్​ రాజ్​ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని క్యాంప్ ​ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో విద్యుత్, బొగ్గు వాడుకున్నందుకు జెన్​కో, ట్రాన్స్​కో నుంచి సుమారు రూ.45 వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉండగా.. వాటిని చెల్లిస్తామని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ చెల్లించలేదన్నారు

బీఆర్​ఎస్​ హయాంలోనే సింగరేణిలో అనేక కుంభకోణాలు జరిగాయని, మెడికల్​ బోర్డు దందా చేసి రూ.కోట్లు దండుకున్న వ్యవహారంలో ఆ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్​ లీడర్లు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్​హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో బొగ్గు మాయమైన ఘటనలు ఎక్కడా జరగకపోయినా కోల్​బెల్ట్​ ఏరియాల్లో స్ర్కీన్లను పెట్టి అబద్ధపు లెక్కలతో హరీశ్ ​రావు ప్రచారం చేస్తున్నారని.. వాటిని కార్మికులు, ప్రజలేవరు నమ్మరని అన్నారు. మేయర్​మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పి.ఎల్లయ్య, జాలి రాజమణి, బాలరాజు, జిరమేశ్, డి.సతీశ్, మారెల్లి రాజిరెడ్డి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.


V6 News 5 hours ago
Home Flash News