వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్: శుభారంభం చేసిన భారత అథ్లెట్లు
యూజీన్ (అమెరికా): వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇండియా అథ్లెట్లు శుభారంభం చేశారు. గురువారం జరిగిన మెన్స్ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్స్ గ్రూప్–ఎలో ఆశీష్ యాదవ్ ఈటెను 69.87 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్లో నిలిచాడు. గ్రూప్–బిలో ధరణిధరన్ 68.07 మీటర్లతో 12వ స్థానంతో ఫైనల్కు అర్హత సాధించాడు.
విమెన్స్ డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ డిస్క్ను 52.58 మీటర్ల దూరం విసిరి గ్రూప్–ఎలో ఆరో ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా 12వ ప్లేస్తో టైటిల్ ఫైట్కు క్వాలిఫై అయ్యింది. మెన్స్ 800 మీటర్ల పరుగులో మొగలి వెంకటరామ్ సెమీస్కు చేరుకోగా, యువిన్ ఆనంద్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో ఇండియా టీమ్ తొలి రౌండ్తోనే సరిపెట్టుకుంది. పీయూష్ రాజ్, తహురా ఖాతున్, సయ్యద్ సబీర్, తియా అరుముగంతో కూడిన ఇండియా బృందం హీట్స్లో నాలుగో ప్లేస్తో సరిపెట్టుకుంది.