Vemula Prashant Reddy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
Facebook
Twitter
whatsapp
linkedin
telegram
Vemula Prashant Reddy : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్పట్ల సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. పోలీసులను, కాంగ్రెస్ గూండాలను ఉసిగొలిపి కేసీఆర్ను ఏదో చేస్తాను అనుకుంటే తెలంగాణ సమాజం ఊర్కోదని హెచ్చరించారు.
‘రేవంత్ రెడ్డీ.. నువ్వు మొగోడివైతే కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కో. అంతేతప్ప పోలీసులను, గూండాలను ఆయనపై ఉసిగొల్పి ఏదో చేయాలనుకుంటే కదరదు. తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠం చెబుతుంది’ అని వేముల ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్పై దాడికి వెళ్లడం రేవంత్ సర్కారు దుర్మార్గపు వైఖరిని తెలియజేస్తోందని విమర్శించారు.