బాసరలోని వసంత పంచమి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
బాసర, వెలుగు: బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి దేవి అమ్మ వారి సన్నిధిలో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి ఆహ్వానం అందించారు. సోమవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంతోపాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్కు ఆలయ ఈవో అంజనీదేవి, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ముందుగా సీఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి ప్రసాదాలు అందించారు.