T20 World Cup: బెన్నెట్ పోరాటం వృథా.. డూ ఆర్ డై మ్యాచులో జింబాబ్వేపై భారత్ భారీ విజయం
చెన్నై: టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ (55), హార్ధిక్ పాండ్యా (50) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. చివర్లో తిలక్ వర్మ (44) మెరుపులు మెరుపులు మెరిపించడంతో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా.
గురువారం (ఫిబ్రవరి 26) చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (33) రాణించారు. భారీ చేధనలో ఓవర్లన్నీ ఆడిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. యువ ఓపెనర్ బెన్నెట్ (97) చివరి వరకు పోరాడినప్పటికీ జింబాబ్వే 72 రన్స్ తేడాతో భారీ ఓటమి చవిచూసింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.