T20 World Cup: కాసేపట్లో ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్.. వాంఖెడే మైదానం పిచ్ రిపోర్ట్ ఇదే!
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరు ఇవాళ వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సూపర్–-8 దశలో వెస్టిండీస్ పై గెలిచి భారత్ ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్కు సిద్ధమవుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చింది. కాగా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ కి వెళ్లాలని రెండు టీమ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
వాంఖెడే పిచ్ రిపోర్ట్:
వాంఖెడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పిచ్పై కొంత గడ్డి కనిపిస్తోంది. ఇది పిచ్లో తేమ నిల్వ ఉండేలా చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉంచినట్లు తెలుస్తుంది. వాంఖెడేలో ఉన్న ఎర్ర మట్టిపిచ్ కారణంగా తేమ త్వరగా ఆరిపోకుండా గడ్డి హెల్ప్ చేస్తుంది. అయితే మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం లభించే ఛాన్స్ ఉంది. గడ్డి– ఎర్ర మట్టి పిచ్ లక్షణాలతో ఫాస్ట్ బౌలర్లకి బౌన్స్తో పాటు స్వింగ్, సీమ్ మూవ్మెంట్ ఉండనుంది. దీంతో పవర్ప్లేలో ఓపెనర్లకు స్పీడ్ బౌలర్లు సవాల్ విసిరే అవకాశం ఉంది.