హాల్ టికెట్ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా వెసులుబాటు కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరిగే రోజుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.