తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు.. ఏపీ మాజీ మంత్రి కొడాలి..తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం
తిరుమల క్షేత్రంలో ప్రముఖులు పర్యటిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం (మార్చి 30) ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ కమీషనర్ సంజీవ్ వేరం, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా… .ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు