Ajith Kumar: ప్రపంచ వేదికపై దుమ్మురేపిన తలా రేసింగ్ జట్టు .. పోడియంపై భారత జెండాతో అజిత్ కుమార్
లేటెస్ట్గా బెల్జియంలోని ఫెమస్ ట్రాక్ Circuit de Spa-Francorchamps లో జరిగిన ప్రతిష్టాత్మక 24H Series ఎండ్యూరెన్స్ రేసులో అజిత్ కుమార్ జట్టు అద్భుత ప్రదర్శనతో రెండవ స్థానం (P2) సాధించింది. ఈ విజయం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. పోటీ అనంతరం పోడియంపైకి చేరిన అజిత్ కుమార్, భారత జెండాను ఎగురవేస్తూ తన జట్టుతో కలిసి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు, సినీ ఫ్యాన్స్ “సూపర్బ్ తలా” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.