పాస్పోర్ట్ సూచీలో దిగజారిన భారత్
న్యూఢిల్లీ : మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ఇదివరకటి సూచీలో భారత్ 75వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం(ఐఏటీఏ) నుంచి సేకరించిన డాటా ఆధారంగా రూపొందించే ఈ సూచీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వీసా లేకుండా ప్రవేశం కల్పించే సామర్థ్యం ఆధారంగా పాస్పోర్టులకు ర్యాంకులను ఇస్తుంది.
192 గమ్యస్థానాలకు వీసారహిత ప్రవేశం కల్పిస్తూ సింగపూర్ ప్రపంచ పాస్పోర్టు ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత యూఏఈ, దక్షిణ కొరియా, జపాన్ ఉన్నాయి. 2006లో 71వ ర్యాంకు భారత పాస్పోర్టు 2006లో 71వ ర్యాంకుతో తన అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇది బుర్కినా ఫాసో, క్యూబా, సెనెగల్తో కలసి 78వ స్థానాన్ని పంచుకుంటున్నది. హెన్లీ పాస్పోర్టు సూచీ ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను మూల్యాంకనం చేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత పాస్పోర్టు బలహీనపడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.