వడ్ల కొనుగోళ్లపై రాజకీయాలా?..మండిపడ్డ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో అంచనాలకు మించి వడ్లు, మొక్కజొన్న దిగుబడులు రాగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో రైస్మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్కాంట్రాక్టర్లతో మీటింగ్నిర్వహించారు. పంటను కొన్న తర్వాత త్వరగా మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టిన వడ్ల సంచులను మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే కేసులు పెడతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బాల్కొండ సెక్టార్లో లారీలు సమకూర్చక రైతులను ఇబ్బందిపెట్టిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయిస్తామన్నారు. ప్రతి సెంటర్కు అవసరమైన లారీలను సమకూర్చాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దేనన్నారు. సమావేశంలో కార్పొరేషన్చైర్మన్లు తాహెర్, మోహన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్కిరణ్కుమార్, మార్కెట్చైర్మన్గంగారెడ్డి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, డీఎం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.