తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విప్ ఆది శ్రీనివాస్.. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి..
తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రభుత్వ విప్.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం.. అభివృద్ధి తో ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.
తెలంగాణ లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ స్వామి ఆలయ విస్తరణ పనులు నిరాటంకంగా కొనసాగాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. మరో వెయ్యి ఏళ్ళు భక్తుల రద్దీకి సరిపడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 150 కోట్లతో నాలుగు ఎకరాలలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి.. తిరుమల తరహాలో వేములవాడ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తెలిపారు.