అమెరికా దాడుల భయం..పాక్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు ఇరాన్ విమానాల తరలింపు!
ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్, ఇరాన్ సైనిక విమానాలకు తమ ఎయిర్ఫీల్డ్లలో ఆశ్రయం కల్పించిందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా వైమానిక దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఇరాన్ తన సైనిక విమానాలను పాకిస్థాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్కు తరలించిందని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు ‘సీబీఎస్ న్యూస్’ వెల్లడించింది. అలాగే, ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘనిస్థాన్లో పార్క్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందిస్తూ, ఈ వార్తలు నిజమైతే మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్రపై సమగ్ర పునఃసమీక్ష అవసరమని డిమాండ్ చేశారు.
అయితే, పాకిస్థాన్ అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. నూర్ ఖాన్ ఎయిర్బేస్ నగరం నడిబొడ్డున ఉంటుందని, అక్కడ భారీ సంఖ్యలో విమానాలను దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ విమానం కాబూల్లో ఉందని ఆఫ్ఘనిస్థాన్ పౌర విమానయాన అధికారులు ధృవీకరించారు. పాకిస్థాన్ గత దశాబ్ద కాలంగా సైనిక అవసరాల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోందని, ఇటు అమెరికాకు అండగా ఉంటూనే, అటు ఇరాన్ మరియు చైనాలను దూరం చేసుకోకుండా పాకిస్థాన్ ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోందని ఈ నివేదికలు విశ్లేషిస్తున్నాయి.